డివిజ‌న్ అభివృద్ధే మా ల‌క్ష్యం : ‌తిరుప‌తి యాద‌వ్

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 18 డివిజన్ అభివృద్ధి చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని డివిజ‌న్ తెరాస పార్టీ నూత‌న‌ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తిరుప‌తి యాద‌వ్ అన్నారు. ఇవాళ పార్టీ నూత‌న క‌మిటీ ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా తిరుప‌తియాద‌వ్ మాట్లాడుతూ 18 డివిజన్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాలు అర్హులు అయిన ప్రతి వారికి అందేలా చూస్తామ‌ని అన్నారు. డివిజన్ పరిధిలో సమస్యలు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాను అని తెలిపారు. త‌న‌పై నమ్మకం ఉంచి 18 డివిజన్ జ‌నరల్ సెక్రెటరీ పదవి ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి , మాజీ జడ్పిటిసి శ్రీ మంద సంజీవరెడ్డి గారు, అధ్యక్షుడు చెర్ల ఆంజనేయులు యాదవ్ గారికి అలాగే డివిజన్ ప్రెసిడెంట్ కాటం రాజి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నూత‌న క‌మిటీలో అధ్యక్షుడు గా శ్రీ కాటం రాజిరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ గా విజేందర్ రెడ్డి, నరసింహా గౌడ్, బిసి ప్రెసిడెంట్ నగేష్ గారు, యూత్ అధ్యక్షుడు బాల కృష్ణ చారి, యూత్ జెనరల్ సెక్రెటరీ మధు యాదవ్,మహిళ ప్రెసిడెంట్ శైలజ గారు ఎన్నుకోవడం జరిగింది.