ఆ మాట‌లు చెప్ప‌డానికి సిగ్గులేదా : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఉస్మానియా ఆసుప్ర‌తి నిర్మాణాకి విప‌క్షాలు అడ్డుప‌డ్డాయ‌ని అన‌డానికి మంత్రి శ్రీ‌నివాస్‌యాదవ్‌కి దిమాక్ ఉందా అని మండిప‌డ్డారు తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కాళేశ్వ‌రం క‌ట్ట‌ద‌ని వంద‌ల కేసులు వేసి ఆ ప‌నులు ఎలా జ‌రిగాయని ప్ర‌శ్నించారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌క్క‌నబెట్టి స‌చివాల‌యం నిర్మాణం కోసం మంచి భ‌వ‌నాలు కూల్చ‌డం ఎలా మొద‌లు పెట్టార‌ని విమ‌ర్శించారు. విప‌క్షాలు చెబితే ప్ర‌భుత్వం ప‌ని చేస్తుందా అని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ని ప్ర‌శ్నించారు. స‌మ‌స్య‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డానికి ప‌నికిమాలిన ముచ్చ‌ట్ల‌ను మాట్లాడి మ‌భ్య‌పెట్ట‌డం వారికి వెన్న‌తో పెట్టిన విద్య అని అన్నారు. న‌మ‌స్తే తెలంగాణ‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను మ‌ళ్లీ పూస‌గుచ్చినట్లు మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. వారం రోజుల‌లో ఉస్మానియా ఆసుప‌త్రిని త‌ర‌లిస్తామ‌ని చెప్పిన సీఎం ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఒక్క చిన్న భ‌వ‌నాన్ని కూడా నిర్మించ‌లేదని తెలిపారు. ఇప్ప‌టికైన ప్ర‌జ‌ల కోసం ప‌నులు చేయాల‌ని డిమాండ్ చేశారు.