ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు పిచ్చి ప‌ట్టింది : ‌తిరుప‌తి యాద‌వ్

ప్రతి పక్షాలు రోజు రోజుకు దిగజారుతున్నాయ‌ని, పిచ్చి పట్టినట్టు ప్రతిపక్ష నేతలు ప్రవర్తిస్తున్నార‌ని తెరాస యువ‌నేత తిరుప‌తి యాద‌వ్ కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 70ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా గురించి ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించారా ? గతంలో ఎప్పుడైనా ఉస్మానియా ను సందర్శించారా? అని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ త‌న ముందు చూపుతో 2015 లోనే ఉస్మానియా కు కొత్త భవనాన్ని ప్రతిపాదిస్తే కాంగ్రెస్ నేత‌లు అడ్డుకున్నార‌ని, అప్పుడు అడ్డుకున్న వారే ..ఇప్పుడు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి కడితే కాంగ్రెస్ నేత‌లు తలలు నరుక్కుంటామని గ‌తంలో అన్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. వాళ్లకు అల్జీమర్స్ వ్యాధి సోకినట్టుందని విమ‌ర్శించారు.