మొద‌టి రాత్రి రోజునే భార్య హ‌త్య చేసిన భర్త‌

మొద‌టి రాత్రి , ఇది భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఎంతో ఆనందంగా గ‌డ‌పాల్సిన రోజు. అబ్బా అప్పుడే తెల్లారిందా అని అనుకులే ఉండాల్సిన రోజు. అంతేకానీ అదే రోజు వారికి చివ‌రి రోజున‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ అదే నిజ‌మైంది. చిన్న‌పాటి కోప‌మే శోభ‌నం రోజున హ‌త్య చేసేలా చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే… ఈ ఘటన తమిళనాడు తిరువల్లూరు జిల్లా మింజూర్‌లో చోటు చేసుకుంది.
నీతావసన్‌(24), సంధ్య(20) దగ్గరి బంధువులు. వీరిద్దరికి బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అదే రోజు రాత్రి ఈ నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎన్నో ఆశలతో ఆమె శోభనం గదిలోకి అడుగుపెట్టింది. సుఖ,సంతోషాలతో గడపాల్సిన ఆ సమయంలో.. భార్యతో భర్త గొడవ పెట్టుకున్నాడు. తొలిరాత్రి గదిలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం హత్య దాకా దారితీసింది. ఆవేశంలో భార్యను గునపంతో పొడిచి చంపాడు భర్త. అనంతరం ఇంటికి సమీపంలోని చెట్టుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నూతన దంపతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.