భాగిర్తిపల్లిలో కాలిపోయిన ఇల్లు

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం భాగిర్తిపల్లి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నకంతుల మల్లయ్య ఇంటిలో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. చుట్టూ పక్కలవారు వచ్చేలోగా ఇల్లు పూర్తిగా దగ్ధం అయినది. దింతో తాము రోడ్డున పడినట్టు ఇంటి యజమాని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామా పెద్దలు, ప్రభుత్వం తమని ఆదుకోవాలని అయన కోరారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ వల్ల పని చేసుకోవడనికి అవకాశం లేదని తమని ఆదుకోవాలి కోరారు.