రామ్ గోపాల్ వర్మ మళ్ళీ అదే సినిమా చేస్తున్నాడా ?

వివాదాలకు కేరాఫ్ అడ్డాగా పేరుతెచ్చుకున్నాడు మన రామ్ గోపాల్ వర్మ. గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయని సాహసం అయన చేసాడు. దాంతో అయన వివాదం ఎక్కడ నుండి మరెక్కడికో వెళ్ళిపోయింది. టాలీవూడ్ భామ మియా మాల్కోవాతో జి.ఎస్.టి సినిమా తీసిన తరువాత వచ్చిన హంగామా మన అందరికి తెలుసు. అయితే రాంగోపాల్ వర్మ తాజాగా ఓ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ‘క్లైమాక్స్’ పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘ఆర్.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్’ మరియు ‘శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ను మే 14న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. ‘జి.ఎస్.టి’ ని ఆన్లైన్ లో విడుదల చేసినట్టే.. ‘క్లైమాక్స్’ ను కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.
‘జి.ఎస్.టి’ తో నెలకొల్పిన వివాదాల వేడి ఇంకా తగ్గక ముందే..ఇప్పుడు ‘క్లైమాక్స్’ తో ఎన్ని వివాదాలు సృష్టిస్తాడో అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా వర్మ ఈ లాక్ డౌన్ సీజన్ ను బాగా ఉపయోగించుకుంటున్నాడనే చెప్పాలి. మొదట్లో కరోనా ఓ పురుగు అంటూ ఓ వీడియో సాంగ్ ను విడుదల చేసాడు. అది బాగా వైరల్ అయ్యింది. తరువాత ‘క*నా కు దేవుడికి డ్యూయెట్’ అంటూ మరో వీడియోని విడుదల చేసాడు. అది కూడా బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా మియా మాల్కోవాతో ఓ సినిమా చేసేస్తున్నాడు. మిగితా ఫిలింమేకర్స్ అంతా షూటింగ్ పూర్తయిన తమ సినిమాలను ఎలా విడుదల చేసుకోవాలి, షూటింగ్ ఆగిపోయిన మా సినిమాలను ఎప్పుడు పూర్తిచేసుకోవాలి అని బాధపడుతుంటే.. వర్మ మాత్రం ఈ టైం ను కూడా బాగా ఉపయోగించుకుంటున్నాడు అనే చెప్పాలి.