దేశంలో 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయి. 134 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది. అందులో 49,219 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 26,235 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా  కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 2,549కి పెరిగింది.