హీరో నిఖిల్‌ పెళ్లి

యువ కథానాయకుడు నిఖిల్‌ వివాహ వేడుక మొదలైంది. తను ప్రేమించిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మతో గురువారం ఉదయం 6.31 గంటలకు వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. తొలుత నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్‌ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో పెళ్లి వేడుకను వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ తర్వాత వధూవరులకు సరిపోయే ముహూర్తాలు లేకపోవడంతో మే 14న వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ, శామీర్‌పేటలోని ఓ ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌లో అతికొద్దిమంది బంధువుల మధ్య నిఖిల్‌ వివాహం జరగనుంది.