తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే 117 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. మరో ఇద్దరు చనిపోయారు. ఇవాళ నమోదయిన కేసుల్లో 31 జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాగా.. మరో 10 మంది వలస కూలీలు ఉన్నారు. తాజా గణాంకాలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1367కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 939 మంది కోలుకోగా.. 34 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 394 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.