మన దేశ బ్రాండ్లను మాత్రమే వాడండి : నిర్మల సీతారామన్

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే స్వయం ఆధారిత భారత్‌ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

నిర్మలా సీతారామన్‌ ప్రసంగం- ముఖ్యాంశాలు

లాక్‌డౌన్‌తో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి
45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట
రూ. 3 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ
చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు
అత్యవసరాల కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల అప్పులు
4 సంవత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్చు
విద్యుత్‌ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్ల నిధులు
ఈపీఎఫ్‌: ప్రభుత్వమిస్తున్న సాయం మరో 3 నెలల పాటు పొడిగింపు
తద్వారా 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది
ఇందుకోసం రూ. 2500 కోట్లు కేటాయింపు
ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్లు
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లను ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్లు
ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వాల్సిన బాకీలు తీరుస్తాం
కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగింపు
కరోనాతో వాయిదాపడిన రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణాల కాలపరిమితి 6 నెలల పాటు పొడిగింపు
పనిని బట్టి కాంట్రాకట్లర్లకు డబ్బులు చెల్లింపు
ఇక పన్నుల విషయానికొస్తే.. రేపటి నుంచి మార్చి 2021నాటికి చెల్లించాల్సిన టీడీఎస్‌, టీసీఎస్‌ 25 శాతం తగ్గింపు
తద్వారా 50 వేల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లోనే
ట్యాక్స్‌ రిటర్న్స్‌ తేదీ 31 జూలై నుంచి నవంబరు 30 వరకు పొడిగింపు