వాళ్ళు ప్రాణాలు కాపాడే దేవతలు

కరోనా వైరస్ ఇబ్బందికర పరిస్థితితుల్లో నర్సులు ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు అని కిమ్స్ హాస్పిటల్స్ ఎండి భాస్కర్ రావు అన్నారు. మంగళవారం ప్రపంచ నర్సుల డే సందర్బంగా అయన కిమ్స్ హాస్పిటల్స్ లో పని చేస్తున్న నర్సులకు శుభాకాంక్షలు తెలియజేసారు. సమాజంలో ప్రాణాలు కాపాడుతున్న దేవతలు వారి అని కొనియాడారు. కిమ్స్ లో కోవిద్ డ్యూటీ చేస్తున్న వారిని గుర్తించి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికీ సర్టిఫికెట్లు ప్రదానం చేసారు. అలాగే హాస్పిటల్లో వారికి పై పులావాన కురిపించారు. అనంతరం కరతాళ ధ్వనుల మధ్య సామజిక దూరం పాటిస్తూ హాస్పిటల్ ప్రాంగణంలో మార్చిఫస్ట్ నిర్వహించారు.