కేసీఆర్‌ క్వారంటైన్‌ ముఖ్యమంత్రి : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంది పడ్డారు. రైతులు కష్టాలు పడుతుంటే పటించుకోవడం లేదని విమర్శించారు. బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ‌బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో బత్తాయి రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వమే బత్తాయిలను కొనుగోలు చేయాలని కోరారు. రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆరు సంవత్సరాలు క్వారంటైన్‌లో ఉన్నారని, రైతులతో మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి లేదని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను క్వారంటైన్‌ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రైతులకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.