కెసిఆర్ మౌనానికి అదే కారణం : బీజేపీ

సీమాంధ్ర ఓట్ల కోసం తెలంగాణ సీఎం మాట్లాడడం లేదు అంది తెలంగాణ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లినప్పుడు మండిపడ్డ కేసీఆర్.. ఇప్పుడు జగన్ 88 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి పోతిరెడ్డిపాడు హెచ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం వెనుక జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకొని పోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మరికొద్ది నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందునే సీఎం నోరు మెదపడం లేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. వారి ఓట్ల కోసమే కేసీఆర్ మౌనం వహిస్తున్నారని విమర్శించారు.