తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా మళ్లీ పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1275కి చేరింది. మృతుల సంఖ్య 30గా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.