కరోనా వచ్చింది టూరిస్టు వీసాపై కాదు: మహీంద్ర

లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఆత్మహత్యా సదృశ్యమని (హరాకిరి) ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అన్నారు. లక్షల మంది ప్రాణాలు కాపాడుకొనేందుకు లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ ఇంకా పొడిగిస్తే సమాజంలోని బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని హెచ్చరించారు.