తెలంగాణలో మరో 33 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కూడా పెరిగింది. నిన్న 31 కేసులు నమోదు అవ్వగా.. తాజాగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1196కి చేరింది. మరణాల సంఖ్య 30గా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ నమోదైన కేసుల్లో 26 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇప్పటి వరకు 751 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం 415 మంది చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.