భారీగా విరాళం

కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు సీడ్స్ మెన్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 3.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి అందించారు. అలాగే సత్తుపల్లి నియోజవర్గానికి చెందిన ఎంపిపిలు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, మున్సిపల్ చైర్మన్స్, సొసైటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 17 లక్షల 85 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రికి అందించారు.