తెలంగాణలో భారీగా పెరిగిన కరోన పాజిటివ్ కేసులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 కేసులు

తెలంగాణలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,163కి చేరింది. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇవాళ కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 24 మంది బాధితులు డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు మొత్తంగా 751 మంది కొవిడ్‌ బాధితులు కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 382 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.