వైన్ షాపుల ముందు జాతర
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఆయా రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచారు. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ మద్యం ప్రియులు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలనీ , షాపుల ముందు జనసంచారం లేకుండా చూడాలని చెప్పింది. అయితే సర్కార్ చెప్పిన మాటలు పట్టించుకోని ప్రజలు ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున్న వైన్ షాపుల ముందు గుమిగూడారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో షాపుల ముందు జాతరలాగ ఉంది వాతావరణం.
దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు.
చత్తీస్ఘడ్లోని రాజ్నంద్గాన్లోని సోమవారం ఉదయం మద్యం షాపుల ముందు వేలాదిమంది తరలివచ్చారు. కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ 3.0 నిబంధనలకు అనుగుణంగా కంటైన్ మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో ఛత్తీస్ఘడ్ రాష్ట్రప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఓ వైన్ షాప్ ఎదుట వేలాది మంది మద్యం ప్రియులు బారులు తీరారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. ఈ రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.
ఏపీ లో కూడా ఈరోజు నుండి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి












