రాంకోఠిలో కరోనా కలకలం

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి రాంకోటిలో ఓ 57 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ కలకలం రేగింది. ఇటీవల మెదక్ లో అతని కూతురు బంధువుల పెళ్లికి హాజరైన సమాచారం. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షల నిమిత్తం స్థానిక హాస్పిటల్ తీసుకవెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే కరోనా లక్షణాలు ఉన్నాయంటూ… గాంధీకి రిఫర్ చేసిన వైద్యుడు. పరీక్షల అనంతరం పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ వార్డ్ కు తరలించిన వైద్యులు. కుటుంబ సభ్యులను హోమ్ క్వరెంటైన్ లో ఉంచిన అధికారులు.