కోవిడ్ ఆసుపత్రికి రూ.50 లక్షలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్ ఆసుపత్రికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్ గిరి కలెక్టర్ ను కలిసి ఈ మేరకు లేఖ అందజేశాడు. గచ్చిబౌలిలో కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి నిర్మించిన విషయం తెసిందే. ఐతే, ఈ ఆసుపత్రికి సివరేజ్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారు. ఈ కారణంగా మురుగు నీరంతా పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళుతోంది. అక్కడ విద్యార్థులు, సిబ్బంది ఈ సమస్యను సోషల్ మీడియాలో లేవనెత్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి చొరవ చూపుతున్నారు. ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయిస్తూ ఈ మేరకు కలెక్టర్ కు లేఖ అందజేశారు. వారం రోజుల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.