ఆ పాటను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ నగర జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఒక ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. బొంతు శ్రీదేవి నిర్మించిన ఈ కరోనా వైరస్ అవగాహన గీతాన్ని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కందికొండ సాహిత్యాన్ని అందించారు. ఈ గీతాన్ని ఈరోజు పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు మేయర్ బొంతు రామ్మోహన్ తో ఉన్నారు. ఈ ప్రత్యేక గీతం చాలా బాగా వచ్చిందని ఖచ్చితంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తుందని, వైరస్ కట్టడీ కోసం పని చేస్తున్న వారి పట్ల గౌరవాన్ని పెంచుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పాటను నిర్మించిన బొంతు శ్రీదేవితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ ను ప్రత్యేకంగా అభినందించారు.