వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రగతి భవన్ లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ధాన్యం కొనుగోలు, ఎరువుల సరఫరా పై చర్చినచన్నునారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.