55 ఏళ్ళు దాటినవారు ఉద్యోగానికి రావొద్దు : పోలీస్ శాఖ

కరొనను అదుపు చేయడానికి ముంబై పోలీసు శాఖ కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ది. 55 ఏళ్లు దాటిన పోలీసులు ఎవ‌రూ విధుల‌కు హాజ‌రుకావొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. న‌గ‌రంలో ముగ్గురు పోలీసులు వైర‌స్ బారినప‌డ‌డం వ‌ల్ల పోలీసుశాక ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. వైర‌స్‌ను సంపూర్ణంగా నియంత్రించేంత వ‌ర‌కు డ్యూటీకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ముంబై పోలీసు చీఫ్ ప‌రంబీర్ సింగ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. అయితే వారంతా 50 ఏళ్లు దాటిన వారు కావ‌డం శోచ‌నీయం. 55 ఏళ్ల పైబ‌డిన వారికి వైర‌స్ త్వ‌ర‌గా సోకే ఛాన్సు ఉంటుంద‌ని ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసులు 6వేల‌కు చేరుకున్నాయి. ఆ న‌గ‌రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 219గా ఉన్న‌ది.