ఏపీ అదుపులోకి రాని కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా కేసులు పాజిటివ్ కేసులు అదుపులోకి రావడం లేదు. తాజా హెల్త్ బులిటెన్ఏ పీలో కొత్తగా 80 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదు అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 1177 కి చేరిన పాజిటీవ్ కేసులకు చేరింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులు వచ్చాయి. అలాగే 6517 మంది నుంచి శాంపిల్స్ సేకరణ చేసినట్టు తెలిపింది. కర్నూలులో ౧౩ గుంటూరు 23, కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున కొత్తగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరు 237,కృష్ణా జిల్లాలో 210 కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కరోనా పాజిటివ్ తో 235 మంది రోగులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యరని తెలిపింది. అలాగే వివిధ ఆసుపత్రుల్లో 911 మందికి కొనసాగుతున్న చికిత్స పొందుతున్నారు అని ఆరోగ్య శాఖ తెలిపింది.











