ముంబయిలో మరో 11 కరోనా మరణాలు

మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో కొవిడ్‌ 19 మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఈ రోజు కొత్తగా మరో 11 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ముంబయి మహానగరంలో మరణాల సంఖ్య 75కి చేరినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. అలాగే, నగరంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1182కి చేరింది.