వ్యాక్సిన్ల తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయ్‌

కరోనా వైరస్‌ కట్టడి కోసం వ్యాక్సిన్ల తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం సాగిస్తున్నాయని.. ప్రజలు సైతం ఈ పోరాటంలో సహకరిస్తున్నారన్నారు. కరోనాకు సరిహద్దులంటూ ఏమీ లేవని.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 212 దేశాలకు విస్తరించిందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. మాస్కులు ధరించడం అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు.