కరోనా దెబ్బకి సంపూర్ణ మద్య నిషేధం
కరోనా దెబ్బకి మనం బతికుండగా నమ్మలేని, జీవితకాలంలో ఊహించలేని, కొన్ని గొప్ప సంఘటనలు జరిగాయి:
- సంపూర్ణ మద్య నిషేధం అమలు.
- దిక్కుమాలిన తెలుగు సీరియల్స్ ఆగిపోవడం.
- పెద్ద నగరాల్లో ఆఫీస్ నుంచి ఇంటికి చేరే సమయంలో నాలుగు గంటల దాకా బయటే ట్రాఫిక్ లో గడిచిపోయే పరిస్థితి నుంచి బయట పడటం.
- ట్రాఫిక్ జామ్లు లేని నగరాలు, కూడళ్ళు.
- కాలుష్య రహిత పట్టణాలు.
- ఇంటి యజమాని పిల్లల చదువు సంధ్య లు గమనించడం, వాళ్లతో ఆడుకోవటం.
- మగవాళ్ళు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేయడం.
- డబ్బులు నగలు, షాపింగ్, ఇతర అనవసర వస్తువులు మీద తగలకుండా, అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడం.
- డబ్బులు అతి జాగ్రత్తగా పొదుపు గా వాడుకోవడం.
- బయట అడ్డమైన దరిద్రాలు తినకపోవడం.
- వ్యక్తిగత శుభ్రత మీద, పరిసరాల శుభ్రత మీద జాగ్రత్తలు తీసుకోవటం.
- బండిలో పెట్రోల్ తగలేసి ఊరు,వాడ త్రిపాద నక్షత్రాల లాగా తిరక్కపోవడం.
- సాధ్యమైనంతవరకు నాన్వెజ్ మానేసి వెజ్ తినడం.
- భారతీయ సాంప్రదాయ పద్ధతులు గుర్తు తెచ్చుకుని పాటించడం.
- సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, పక్కవారికి రోగాలు రాకూడదు అని కోరుకోవడం.
- డబ్బు ఎంత ఉన్నా, అవసరమైనప్పుడు మన పని మనమే చేసుకోవాలి, అని గుర్తెరిగి , పని మనిషి లేకపోయినా ఇంటి పనులు కలసి మెలసి అంతా చేసుకోవడం. ఈ 16 సూత్రాలు, లాక్ డౌన్ తర్వాత కూడా పాటిస్తే, ఆరోగ్యం,మనశ్శాంతి,ఐశ్వర్యం, క్రమశిక్షణ, ఒళ్ళు వంచి పని చేయడం ,అన్నీ మీ సొంతం. జై హింద్!