గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు

జిల్లాలోని గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు శుక్రవారం పర్యటించారు. గజ్వేల్‌లో కరోనా సోకిన వ్యక్తి ఇంటి పరిసరప్రాంతాల్లో నివశించే వారికి వైరస్‌పై అవగాహన కల్పించారు. లాక్ డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో ఉండాలని సూచించారు. వైరస్‌ను పారద్రోలేందుకు అందరూ తోడ్పాటు అందించాలని కోరారు. అనసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. అత్యవసరమైతే వెళ్లి వచ్చినప్పుడు కాళ్లూ, చేతులు కడుక్కోని ఇంట్లోకి వెళ్లాలన్నారు. అవసరమైతే బట్టలను కూడా వేడినీళ్లలో ముంచి ఆ బట్టలను ఆరబెట్టుకుంటే ఇంకా మంచిదన్నారు. ఇంకో 15 రోజులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నా ఫోన్ చేయాలని మంత్రి సూచించారు.