పోలీసు బృందానికి రూ.20వేల రివార్డు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నుంచి రుద్రాపూర్ వచ్చిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు 13 మందిని పట్టుకున్న పోలీసు బృందానికి రూ.20వేల రివార్డును ఉత్తరాఖండ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. మొరాదాబాద్ జమాత్ సమావేశంలో పాల్గొని రుద్రాపూర్ వచ్చిన 13 మంది తబ్లిగ్ జమాత్ కార్యకర్తలను పోలీసులు పట్టుకొని వారిని క్వారంటైన్ చేశారు. 13 మంది జమాత్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి, వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ కు తరలించామని వైద్యాధికారులు చెప్పారు. కరోనా వైరస్ ప్రబలకుండా జమాత్ కార్యకర్తలను పట్టుకున్న పోలీసు బృందాన్ని డీజీపీ అశోక్ కుమార్ అభినందించారు.