నిత్యావసర సరుకులు పంపిణీ

కరోనా వైరస్(కోవిడ్-19) నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో పలు చోట్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న కూలీనాలీ చేసుకునే ప్రజలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో గుడిసె వేసుకుని నివసిస్తూ కూలీపని చేసుకునే దినసరి కూలీ ధారవత్ కుమార్ అనే వ్యక్తి కుటుంబం రెండు రోజులుగా పనిలేక, తినడానికి తిండిలేకపోవడంతో తెలంగాణ సీఎంఓ, కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలకు తెలపడంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశానుసారం బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు తీసుకుని గుడిసె వద్దకు చేరుకుని కుమార్ కు అందించిన కీసర పోలీసులు.