కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరిం చాలి

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం శ్రీ కేసీఆర్ మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ శుచి, శుభ్రత పాటించటంతో పాటు కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని సీఎం ప్రజలను కోరారు. ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని, ముందు జాగ్రత్త పాటించి మనల్ని మనం కాపాడుకుందాం.. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని సీఎం విజ్ఞప్తి చేశారు..