సీఎం బిడ్డకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజ్ గోపాల్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో.. ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విటర్ యుద్ధం కొనసాగుతోంది. కవిత ట్వీట్ కి స్పందించిన రాజగోపాల్.. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ అంటూ గట్టిగా సమాధానం చెప్పారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ .. తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో… ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విట్టర్ యుద్ధం కొనసాగుతోంది. ఈ కేసులో సోమవారం 181 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ… అందులో 28 సార్లు కవిత పేరును ప్రస్తావించింది. కవితతో కలిసే ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రు మద్యం వ్యాపారం చేసినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ… రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. లిక్కర్ క్వీన్ పేరు చార్జ్ షీట్ లో 28 సార్లు ప్రస్తావించారని పేర్కొన్నారు.