భాజ‌పాలోకి భారాస‌ మాజీ ఎమ్మెల్యే

ఆదిలోనే భార‌త్ రాష్ట్ర స‌మితికి ఎదురు దెబ్బ త‌గిలింది. జాతీయ పార్టీగా తెరాస‌ను భార‌త్ రాష్ట్ర స‌మితి ప్ర‌క‌టించిన మ‌రునాడే ఆ పార్టీ టాటా చెప్పారు మాజీ ఎమ్మెల్యే. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్ లో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు.

సమైక్య వాది అయిన ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి చేశారని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి చెప్పారు. విఆర్ఏల‌ సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మొలుగూరి భిక్షపతి అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పారు.