తెరాస నేత‌లో ఈడీ గుబులు ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్!

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నాల‌ని సృష్టిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం సంస్థ ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాంతో మొద‌లైన ఈ అల‌జ‌డి ఇప్పుడు పెద్ద స్థాయి నేత‌ల ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ వ‌ర‌కు వ‌చ్చాయాంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. చీకోటి ప్ర‌వీణ్‌తో మొద‌లైన విచార‌ణ ఢిల్లీ లిక్క‌ర్ స్కాం, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి విచారణ వ‌ర‌కు సాగింది. అయితే ఇప్పుడు మ‌రింత జోరు పెంచిన ఈడీ తెరాస‌లో పెద్ద నేత‌ల భ‌ర‌తం ప‌ట్టే ప‌నిలో ఉన్నార‌ని స‌మ‌చారం.

ఇక తాజాగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనూ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నేతలను హెచ్చరించారు. రాష్ట్రంలో సీబీఐ ఈడీ ఐటీ దాడులు జరగవచ్చని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఆయన చెప్పినట్టుగానే హైదరాబాద్ లో చాలా చోట్ల ఈడీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చకు తెరలేపింది.

ఈ వ్యవహారంలో ఈ టీఆర్ఎస్ నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా అరెస్ట్ లు మొదలు కావడంతో ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలంతా ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేపుతోంది. టీఆర్ఎస్ క్యాడర్ లో ఆందోళనకు కారణం అవుతోంది.

మీడియాలో అరెస్ట్ ల పర్వం మొదలుకావడంతో గులాబీ నేతలకు కిందిస్థాయి నేతలు ఫోన్లు చేసి ఆరాతీస్తున్నారు. కానీ చాలా మంది టీఆర్ఎస్ కీలక నేతలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టు సమాచారం. దీంతో తమ నేత అరెస్ట్ అవుతాడన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.

ఇక జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు వైరల్ అవుతున్నాయి. టీఆర్ఎస్ ముఖ్య నేత కేసీఆర్ కుడిభుజంగా ఉండే ఓ నేత ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని.. కేసీఆర్ అలెర్ట్ చేయడంతోనే ఇలా స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తోందనన్న ఆందోళన గులాబీ పార్టీలో సాగుతోంది.

చాలా మంది టీఆర్ఎస్ నేతలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. కనీసం తమ అనుచరులకు కూడా అందుబాటులో ఉండడం లేదని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసినో స్కాంలో టీఆర్ఎస్ నేతలను బుక్ చేయాలని చూస్తున్నారని.. ఈ మేరకు అరెస్ట్ లకు ఈడీ సిద్ధమైందన్న సమాచారంతోనే ఇలా టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పోతున్నారని ప్రచారం సాగుతోంది.

మొత్తంగా తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంతోపాటు కేసినో కేసు షేక్ చేస్తోంది. అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.