బాధితుల‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గడ్డ‌

సికింద్రాబాద్ లోని రూబీ మోటార్స్ లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన సందర్శించి పరిశీలించారు., ప్రత్యక్షసాక్షులు, అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ప్రసూన మాట్లాడుతూ ప్రమాదంలో 8మంది చనిపోవడం చాలా బాధాకరం..భవన నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడం, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడమే కారణమని తెలిపారు.. అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా ఇందుకు కారణమని పేర్కొన్నారు.. ఉన్నతస్థాయి కమిటీని వేసి సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.. మృతుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. అన్ని హోటల్స్ వద్ద సేఫ్టీ మెథడ్స్ పాటించే విదంగా చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు..