తెలంగాణ‌లో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,708 శాంపిల్స్ పరీక్షించగా, 116 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు కాగా, మిగిలిన ఏ ఒక్క జిల్లాలో కూడా డ‌బుల్ డిజిట్ కేసులు న‌మోదు కాలేదు. ఇంకా 444 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు.