తెలంగాణలో చాపకింద నీరులా పాకుతున్న క‌రోనా

తెలంగాణ‌లో చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది క‌రోనా వైర‌స్‌. గడచిన 24 గంటల్లో 12,458 కరోనా పరీక్షలు నిర్వహించగా, 47 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 36 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, సంగారెడ్డి జిల్లాలో 1, సూర్యాపేట జిల్లాలో 1, నారాయణపేట జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో ఒక కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.