దాడులు చేస్తే భ‌య‌ప‌డుతామా ఏందీ ? : కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌

త‌మ పార్టీ నాయ‌కుల‌పై దాడులు చేస్తే భ‌య‌ప‌డి వెన‌క్కి వెళ్తామ‌నుకోవ‌డం వైకాపా నేత‌ల మూర్ఖ‌త్వమ‌ని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గడ్డ ప్ర‌సూన‌. హ‌త్య‌చార ఘ‌ట‌న బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే అడ్డుకునే హ‌క్కు మీకు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో వాసిరెడ్డి ప‌ద్మ సృష్టించిన హంగామాతోనే ఆ పార్టీ లోసుగు తేలిపోయింద‌న్నారు. మ‌ళ్లీ ఇప్పుడు కొత్త‌గా రాళ్ల దాడులు చేయ‌డం హేయ‌మైన చ‌ర్య‌గా పేర్కొన్నారు. త‌మ పార్టీ నాయ‌కుడు నారా లోకేష్‌కి ఏ ప్ర‌మాదం జ‌రిగినా వైకాపానే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. ఇక‌పై దాడులు చేస్తే ఊరుకోమ‌ని ప్ర‌తి దాడులు త‌ప్ప‌వ‌ని ఆమె ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు.