ఎంపీ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన డాక్ట‌ర్. వ‌సుంధ‌ర‌

రాజ్య‌సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా
కూకట్ పల్లి లోని తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు కిమ్స్ హాస్పిట‌ల్స్ కన్సల్టెంట్ గైనకాలాజిస్ట్ డా.వసుంధర. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. పర్యవరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డా. త్రిపుర సుందరి, డా.పూర్ణిమ, డా.హిమదీప్తి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు డా.వసుంధర.