మిజోరాం గ‌వ‌ర్న‌ర్‌గా కంభంపాటి హ‌రిబాబు

ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత కంభంపాటి హరిబాబు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. వివిధ రాష్ట్రాల‌కు కొత్త‌గా గ‌వ‌ర్న‌ర్‌ల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇద్ద‌రికీ గ‌వర్న‌ర్ ప‌దువులు ఇస్తూ పెద్ద‌పీట వేశారు. ఇప్ప‌టికే తెలంగాణ నుండి బండారు ద‌త్తాత్రేయ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన అనుభవం ఉంది. అలాగే కేంద్ర మంత్రి నుంచి థావ‌ర్‌చంద్ గెహ్లోత్‌ను క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ మార్పు చేశారు.