జ‌డ్జిలు మారిన జ‌డ్జిమెంట్ మార‌లేదు : ‌కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌

ఎన్ని అడ్డంకులు ఎదురుప‌డినా… చివ‌ర‌కు న్యాయ‌మే గెలుస్తుంద‌ని మ‌రోసారి రుజువైంద‌న్నారు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్రసూన‌. ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అడ్డుకోవ‌డానికి అధికార పార్టీ వైకాపా చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేద‌ని, చివ‌రకు హై కోర్డు జ‌డ్జిలు మార్చినా… న్యాయ‌మే గెలిచింద‌న్నారు. ఇవాళ హై కోర్టు వెలువ‌రిచిన తీర్పు ప్ర‌భుత్వాన్ని చెంప పెట్టులాంటిద‌ని అన్నారు. స్థానికంగా తెలుగుదేశం పార్టీ బ‌లంగా ఉంది కాబ‌ట్టే వారి వెన్నులో వ‌ణుకు పుట్టింద‌ని వ్యాఖ్యానించారు. త‌మ‌ను ఎదురుకునే శ‌క్తి లేక ఎన్నిక‌ల వాయిదాలు వేయ‌డం అల‌వాటైంద‌ని అన్నారు.  న్యాయ‌స్థానం తీర్పుతుతో ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉన్నామ‌ని అన్నారు. త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు.