అయోధ్య రామమందిరనికి యుగతతులసీ పౌండేషన్ విరాళం

“అయోధ్య లోని శ్రీరామ జన్మభూమి మందిర్ నిర్మాణ ట్రస్ట్ కి 1,01,116/- రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించిన యుగతులసీ చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కె.శివకుమార్ “

హైదరాబాద్ లోని కాచిగూడలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి మందిర్ నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ ధర్మాచార్యుల సమ్మేళనం లో యుగతులసీ పౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కె.శివకుమార్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ కె.శివకుమార్ గారు మాట్లాడుతూ హిందూ బంధువులకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి తన వంతుగా యుగతులసీ తరపున Rs.1,01,116/- రూపాయలను ప్రకటించారు.
అదే విధంగా సకల దేవతా స్వరూపమైన గోమాత రక్షణ కోసం యుగతులసీ పౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ‌న చేపట్టబోతున్న గో సడక్ బంద్ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్రం ప్రతినిధులను ఆహ్వానించారు.