రెవెన్యూ అధికారిపై మహిళ దాడి

డెక్క‌న్ న్యూస్ఆ, దిలాబాద్ జిల్లా ప్ర‌తినిధి, సయ్యద్ ఖమర్ :

రాష్ట్రస్థాయిలో ఆఫీసర్లు భూ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజల యొక్క భూ సమస్యలకు పరిష్కరించబటం లేదు.కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యం వలన పేద ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు.భూప్రక్షాళనలో తమ భూమి తక్కువగా నమోదు చేశారనే ఆగ్రహంతో రెవెన్యూ అధికారిపై మహిళా రైతులు దాడికి దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కుప్పర్ల గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని వడ్డాడి గ్రమానికి చెందిన రైతు గంగారాంకు అదే గ్రామంలో 3.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం 1.20 ఎకరాలుగానే నమోదు అయింది. రికార్డుల్లో ఈ వివరాలను సరిచేయాలంటూ గతంలో వీఆర్వోగా విధులు నిర్వర్తించిన రోహిత్ చుట్టూ కొన్ని నెలలుగా తిరిగారు. ఎన్నిసార్లు అడిగినా సరిగా సమాధానం చెప్పకుండా తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని మహిళా రైతులు ఆరోపించారు. ధరణి పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు వడ్డాడి గ్రామానికి రెవెన్యూ అధికారులతో సహా రోహిత్ కూడా హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత రైతు కుటుంబసభ్యులు కార్యాలయానికి చేరుకొని వీఆర్వోపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న మండల ఎమ్మార్వో.. భూమి సర్వే చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళా రైతులు శాంతించి అక్కడనుంచి వెళ్లిపోయారు.