జ‌గ‌న్ అంటే కేసీఆర్‌కి భ‌యం : బ‌ండి సంజ‌య్‌

అపెక్స్ కమిటీ స‌మావేశాన్నివాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అడగడంపై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య న‌డుసున్న జ‌లవివాద విష‌య‌మై తాను కేంద్ర మంత్రి కి పిర్యాదు చేస్తే ఆయన వెంటనే స్పందించారన్నారు. ఇద్దరు సీఎం లతో ఆగస్ట్ 5 న సమావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఆ కేంద్ర మంత్రి తెలుప‌గా… తనకు బిజీ షెడ్యూల్ ఉందని.. అదే మీటింగ్ ఆగ‌స్ట్ చివ‌రి వారం పెట్టాలని సీఎం కేసీఆర్ అన‌డంలో ఆంత‌ర్యం ఏంట‌ని ప్ర‌శ్నించారు.
“ఏం పని ఉందని సమయం లేదని అంటున్నాడు? అపెక్స్ కమిటీ వాయిదా వేయాలని ఆ(ఏపీ) రాష్ట్ర సీఎం కోరాలి.. కానీ ఈ సీఎం అడుగుతున్నాడు. సెక్రటేరియట్ కూల్చడానికి సమీక్షల మీద సమీక్షలు నిర్వహించిన సీఎం.. ఈ విష‌యంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? డగుల్బాజీ సీఎం.. ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడు? సీఎం కి అంత బిజీ షెడ్యూల్ ఏంటో బహిర్గతం చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో అరగంట మాట్లాడే సమయం లేదా సీఎం కి” అని బండి సంజ‌య్ ఫైర్ అయ్యారు.సీఎం కేంద్రం పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో కేసీఆర్ త‌న‌కు లాభం జరిగేలా వ్యవహరిస్తున్నాడని ఎంపీ అన్నారు. కేంద్రం పై మాట్లాడుతున్న సీఎం .. ఏపీ పై, జగన్ పై ఎందుకు మాట్లాడడం లేదని ప్ర‌శ్నించారు. జగన్ తన బండారం బయట పెడతాడు అని కేసీర్ భయపడుతున్నాడని అన్నారు.