సిగ్గుమాలిన రాజకీయాలకు ప్రతీకగా తెరాస :రాజశేఖర్ రెడ్డి

ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే మెదక్ ప్రజలను ఒక్క రోజు కూడా పట్టించుకోని మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఈరోజు మాత్రం కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెదక్ ప్రాంతంలో మొక్కలు నాటడం, రక్తదానం చేయడం కేటీఆర్ మెప్పు కోసమేనని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. పద్మాదేవేందర్ రెడ్డికి పదవి మీద ఉన్న ఆరాటం ప్రజల మీద లేదని ఆయన మండిపడ్డారు. ఒకవైపు ఆరోగ్యశాఖ తెలంగాణలో సమూహ వ్యాప్తి మొదలైందని చెప్తుంటే ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం గుంపులు గుంపులుగా కోవిడ్ -19 నిబంధాల్ని తుంగలో తొక్కి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఇది మెదక్ ప్రజల ఆరోగ్యాలకు భవిష్యత్తుకు విఘాతం కలిగించే ప్రయత్నం ఆయన ఆరోపించారు.