లోక్‌స‌భ‌లో ఆ ఎంపీ సీటును అందుకే మార్చారా?

వైకాపా నుండి గెలిచి… అదే పార్టీతో గొడ‌వ పెట్టుకున్న ఆ పార్టీ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణంరాజు సీటును మార్చారు లోక్‌స‌భ అధికారులు. స‌భ‌లో ఏడ‌వ వ‌రుస‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల‌కు సీట్లు క‌ల్పించారు. ఇటీవ‌ల కాలంలో ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు సొంత పార్టీ నేత‌ల‌తోనే గొడ‌వ ప‌డుతున్న సంగ‌తి విదిత‌మే. కాగా ఆయా అంశాల‌ను దృష్టిలో ఉంచుకున్న లోక‌స‌భ అధికారులు అత‌ని స్థానాన్ని ఏడ‌వ లైన్ నుండి నాల్గ‌వ లైన్ లోకి అత‌న్ని స్థానాన్ని మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు.  ఆక‌స్మాతుగా సీట్ల మార్పు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది