ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డికి ట్వీట్ చేసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌ని ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డిని కోరారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఈ మేర‌కు ఆమెకి ట్విటర్ ద్వారా త‌న సందేశాన్ని పంపారు. కోవిడ్-19 మ‌హ్మామారి కాలంలో ప్ర‌జ‌లు ప‌నులు లేక‌, ఆసుప‌త్రుల పాలై అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి కోసం గ‌తంలో న‌మోదు చేసుకున్నవారికి డ‌బ్బులు వ‌చ్చే విధంగా చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. దీంతో ప్ర‌జ‌లకు ఈ స‌మ‌యంలో స‌హాయం చేసిన వారిగా గుర్తుంటార‌ని పేర్కొన్నారు.