మీడియాలో హ‌డ‌వుడికే వారి తాప‌త్ర‌యం : తిరుప‌తి యాద‌వ్

మీడియాలో హ‌డ‌వుడి చేయ‌డానికే కాంగ్రెస్ నాయ‌కులు అన‌వ‌స‌ర రాద్దాతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు తెరాస యువనేత తిరుప‌తి యాద‌వ్‌. ఓ వైపు క‌రోనా క‌ట్ట‌డి కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షంగా స‌రైన స‌ల‌హాలు ఇవ్వాలి కాని చేస్తున్న ప‌నుల‌ను అడ్డుకునేలా వ్య‌వ‌హారించ‌డం మానుకోవాల‌ని సూచించారు. అభివృద్ధి బాట‌లోనే మంత్రి కేటీఆర్ ప‌లు శంకుస్థాప‌న‌లు చేస్తున్నార‌ని గుర్తు చేశారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల కోసం చేసే అభివృద్ధి ప‌నుల‌ను నిలిపివేయాలా అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైన విప‌క్షాలు త‌మ స్థాయిని గుర్తించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.