2015 నుండి ఇంకా వారం రోజులు కాలేదా ? : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఉస్మానియా ద‌వ‌ఖానా ఇంకో రెండు మూడు సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ ఉండ‌దు దీన్ని కూల్చి రెండు కొత్త ట‌వ‌ర్‌లు క‌డుతామ‌ని ఇంకో వారం రోజుల్లో ఇక్క‌డి నుండి షిప్ట్ చేస్తామ‌న్నా సీఎంంకు 2015 ‌నుండి ఇంకా వారం రోజులు కాలేదా అని ప్ర‌శ్నించారు తెజ‌స మెద‌క్ యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఇవాళ కురిసిన వ‌ర్షానికి ఉస్మానియా ద‌వ‌ఖానా లో నీళ్లు నిండిపోవ‌డంతో రోగులు అనేక ఇబ్బందులు ప‌డుతుంద‌ని అన్నారు. అత్య‌వ‌స‌ర ఆరోగ్య ప‌రిస్థితులు ప‌క్క‌న బెట్టి స‌చివాల‌యం ‌నిర్మాణం కోసం తాప‌త్ర‌య ప‌డ‌డం సిగ్గుచేట‌ని పేర్కొన్నారు. ఓ వైపు క‌రోన‌నాతో అల్లాడుతుంటే మంత్రులు కూడా క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు.